మలేసియా లో తొలిసారిగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.డాటుక్ తెెంగ్తుక్ మైమున్ తవాన్ మాట్ను ను ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకోవడం తో తోలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించారు.
ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రిచర్డ్ మలంజుమ్ గత నెల 12న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా డాటుక్ కు ఆ భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని మలేసియా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.ఆమె జనవరి 8, 2013 న అప్పీల్ న్యాయమూర్తి కోర్టుగా మారడానికి ముందు సెప్టెంబరు 5, 2007 న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.ఆమె గత ఏడాది నవంబర్ 26 న ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందింది.1963 లో దేశం ఏర్పడినప్పటి నుంచి 15 మంది ప్రధాన న్యాయమూర్తులు గా వ్యవహరించగా వారంతా కూడా పురుషులే కావడం విశేషం.
దీనితో డాటుక్ తోలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించినట్లు అయ్యింది.దీనితో ఆమె మలేసియాలో ఫెడరల్ కోర్టు అత్యున్నత న్యాయస్థానం, తుది అప్పిలేట్ కోర్టు.ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై దేశ న్యాయవ్యవస్థ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.కౌలాలంపూర్ హైకోర్టులో జుడిషి యల్ కమిషనర్గా కెరీర్ను ప్రారంభించిన టెంగ్కు మైమూన్ తరువాత కౌలాలంపూర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.2013 జనవరి 8న ఆమె అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2018 నవంబర్ 25 వరకూ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.