చైనాను తీవ్ర భయాందోళకి గురి చేస్తున్న కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు ఓ వైపు చేస్తూ, ఈ వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నారు.
అలాగే వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ కి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.చైనాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ఇప్కపుడు రోనా వైరస్ కారణంగా మలేషియాలో ఓ భారతీయుడు చనిపోయాడు.త్రిపుర రాష్ట్రానికి చెందిన మానీర్ హోస్సేన్ కరోనావైరస్ సోకి మలేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మానీర్ హోస్సేన్ 2018లో ఓ రెస్టారెంట్ లో పనిచేసేందుకు మలేషియా వెళ్లాడు.అక్కడ కరోనా వైరస్ తో మానీర్ చనిపోయినట్లు అక్కడి అధికారులు అతని తాతయ్యకి తెలియజేశారు.
తన మనవడు రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లి అక్కడ పనిచేస్తూ కరోనా వైరస్ సోకి చనిపోయాడని అతని తాత అబ్దుల్ రహీం తెలియజేశారు.అతని మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.