కరోనా కారణం ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అయ్యింది.ఇప్పుడిప్పుడే పలు దేశాలు లాక్ డౌన్ ఎత్తి వేసి విదేశీ విమానాలను ప్రారంభించారు.దాంతో యూరప్ దేశంలో ఇరుక్కు పోయిన మలయాళ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే కేరళ వచ్చారు.50 రోజుల పాటు చాలా కష్టపడి అక్కడ ఉన్న వారు ఎట్టకేలకు బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.తినడానికి కనీసం తిండి కూడా దొరికేది కాదని చాలా జాగ్రత్తగా హోటల్ లోనే ఉండి పోయామని చెప్పుకొచ్చారు.
ఇటీవలే హీరోకు టెస్టు నిర్వహించగా కరోనా నెగటివ్ వచ్చినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
కాని ఆయనతో వెళ్లిన ఇద్దరు యూనిట్ సభ్యులు మాత్రం కరోనా పాజిటివ్ అంటూ నిర్ధారణ అయినట్లుగా గుర్తించారు.వారిద్దరిని కూడా ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.త్వరలోనే వారు డిశ్చార్జ్ అవుతారని మలయాళ సినీ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసు ఉండటంతో ఆయనకు వెంటిలేటర్ను ఏర్పాటు చేయడం జరిగిందట.
ఇదే సమయంలో మరో వ్యక్తి మిడిల్ ఏజ్ అవ్వడంతో సాదారణ ట్రీట్మెంట్ ఇస్తున్నారట.