ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.పరశురామ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.మహేష్ బాబు 27 వ సినిమాగా సర్కారు వారి పాట రూపొందుతుంది.
ఈ సినిమాను సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలొకొన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రెల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేసి 2022 సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.ఈ సినిమాలో విలన్ గా అనిల్ కపూర్ నటిస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నారని టాక్.
ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ ఈ సినిమాకే కీలకంగా ఉంటుందట.
అందుకే ఈ పాత్రలో కోసం చాలా మంది పేర్లు పరిశీలన చేశారట.చివరకు మహేష్ తండ్రి పాత్ర కోసం మలయాళ స్టార్ హీరోను సెలెక్ట్ చేశారట.
ఆ పాత్ర కోసం మలయాళ సీనియర్ హీరో జయ రామ్ ను తీసుకుంటున్నట్టు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 న ప్రారంభమయ్యి వచ్చే నెల 15 వరకు దుబాయ్ లో జరగనుంది.