సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో రోజు రోజుకి వందల్లో వార్తలు సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంటాయి.అయితే ఇందులో నిజమైనవి కదా మరి కొన్ని రూమర్స్.
కొంతమంది లేనిపోనివన్నీ క్రియేట్ చేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఎక్కువగా అలాంటి వారు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారిపై లేనిపోని వన్నీ క్రియేట్ చేస్తూ రూమర్లను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు వారి పై రూమర్లను సృష్టించే వారికి తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.ఇంకొందరు సెలబ్రెటీలు చూసీ చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు.
ఇప్పుడు మనం తెలుసుకో బోయే సంఘటన కూడా అలాంటిదే.మలయాళ నటి భామ ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నించిందంటూ కథనాలు వెలువడ్డాయి.2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండటంతో భయాందోళనకు లోనై ఇలాంటి చర్యకు పాల్పండిదనేది సదరు కథనాల సమాచారం.అయితే తాజాగా ఈ విషయం పై స్పందించిన నటి ఈ వార్తలను కొట్టిపారేసింది.తనపై వస్తున్న ఆరోపణల్లో, కథనాల్లో ఎటువంటి నిజం లేదని.అవన్నీ కూడా రూమర్స్ అని.తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు అని ఆమె తెలిపింది.నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.
మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ఆ నటి తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.ఈ విధంగా తనపై వస్తున్న రూమర్స్ కి తనదైన శైలిలో స్పందిస్తూ వాటికి ఇస్తా పెట్టేసింది.కాగా లోహితదాస్ దర్శకత్వం వహిస్తున్న నైవేద్యం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది భామ.తర్వాత పలు దక్షిణాది సినిమాలలో నటిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.2020 జనవరిలో వ్యాపారవేత్త అరుణ్ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పింది.ఆ తరువాత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఈ మధ్యే కూతురి బర్త్డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది భామ.