మలయాళం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అనిల్ మురళీ(56) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశాడు.గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఆయన.
వ్యాధి ఎక్కవ అవడంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు.వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.
కాగా, ఇతడికి భార్య సుమ, ఇద్దరు పిల్లలున్నారు.అనిల్ మురళీ మరణించాడని తెలిసి ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
అనిల్ మురళీ దక్షిణాది భాషల్లో పలు రకాల సినిమాల్లో నటించాడు.‘కన్యా కుమారియిల్ ఒరు కవిత’ అనే చిత్రం ద్వారా మలయాళీ చిత్ర పరిశ్రమలో ఈ అడుగులు వేశారు.
రాక్ అండ్ రోల్, బాడీగార్డ్, సిటీ ఆఫ్ గాడ్, అవతారం, ఉయరే, బ్రదర్స్ డే వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు మంచి పేరును తెచ్చాయి.టాలీవుడ్ లో రంగేలీ కాశీ, జెండాపై కపిరాజులో నటించారు.
డిజిటల్ ప్లాట్ ఫాం ఆహాలో శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఫొరోన్సిక్’ చిత్రంలో కూడా నటించారు.‘డింకిన్’ అనే చిత్రం ఇంకా సెట్స్ మీదే ఉంది.
ఇందులో దిలీప్, నమితా ప్రమోదు నటిస్తున్నారు.డింకిన్ చిత్రం కోసం ఆయన కొన్ని రోజులు పని చేశారని దర్శకుడు వెల్లడించాడు.
ఇంతలోనే కాలేయ సంబంధిత వ్యాధి హఠాత్తుగా మరణించారు.దీంతో కుటుంబ సభ్యులతో పాటు సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.