సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమా త్రివిక్రం తో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రం, మహేష్ కలిస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.
అతడు, ఖలేజా తర్వాత ఇన్నాళ్లకు వీరి కాంబోలో సినిమా వస్తుంది.ఇక ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో మళయాళ స్టార్ నటిస్తున్నాడని తెలుస్తుంది.
మళయాళంలో హీరోగా డైరక్టర్ ప్రొడ్యూసర్ గా వరుస హిట్లతో దూసుకెల్తున్న పృధ్విరాజ్ సుకుమారన్ మహేష్ సినిమాలో నటిస్తారని టాక్.
మళయాళంలో పృధ్వి రాజ్ చేస్తున్న సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఆయన చేసిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ అయ్యింది. లూసిఫర్ సినిమాని కూడా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఆయనే స్ట్రైట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.ఖచ్చితంగా పృధ్వి రాజ్ ఈ ప్రాజెక్ట్ సైన్ చేస్తే ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారని చెప్పొచ్చు.
సినిమాలో ఆయన విలన్ గా నటించే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాని 2023 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.