విక్టరీ వెంకటేష్ హీరోగా జీతు జోసెఫ్ డైరక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దృశ్యం 2.దృశ్యం సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాను మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ డైరెక్ట్ చేయడం సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది.
గురువారం రిలీజైన దృశ్యం 2 సినిమాపై మళయాళ వర్షన్ ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు.అదెలా అంటే ఆల్రెడీ దృశ్యం 2 మళయాళ వర్షన్ మోహన్ లాల్ చేశారు.
ఆ సినిమా కూడా అమేజాన్ ప్రైం వీడియోలో రిలీజైంది.
మళయాళ వర్షన్ సూపర్ హిట్ అవడం వల్లే తెలుగు వర్షన్ రీమేక్ చేసినా అమేజాన్ ప్రైం లో రిలీజైన మళయాళ వర్షన్ సినిమాను తెలుగు ఆడియెన్స్ కూడా ఎక్కువమంది చూసేశారని అర్ధమవుతుంది.
అందుకే మళయాళ వర్షన్ ఎఫెక్ట్ తెలుగు దృశ్యం 2 మీద పడిందని చెప్పుకుంటున్నారు.అయితే తెలుగు నేటివిటీకి తగినట్టుగా దృశ్యం కు పర్ఫెక్ట్ సీక్వల్ గా దృశ్యం 2 అదిరిపోయిందని అంటున్నారు.
సినిమాకు మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే దృశ్యం సినిమాపై ఉన్న ఇంప్యాక్ట్ తో ఆల్రెడీ తెలుగు ఆడియెన్స్ కూడా దృశ్యం 2 మళయాళ వర్షన్ ను చూశారు.
అదే వెంకటేష్ దృశ్యం 2కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.