వరుస ఫ్లాప్ ల మీద ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఏ మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు.ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ వరుసగా ముగ్గురు దర్శకులని లైన్ లో పెట్టాడు.
ఈ సినిమాలు అన్ని వరుసగా ఈ ఏడాదిలోనే పట్టాలు ఎక్కించాలని అనుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో నక్కిన త్రినాథరావు దర్శత్వంలో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో రవితేజకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది.
దీని తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాలో మాళవిక శర్మను హీరోయిన్ గా ఫైనల్ చేశారు.ఈమె ఇప్పటికే రవితేజతో నేల టికెట్ అనే సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తరువాత అనుకున్న స్థాయిలో ఈ అమ్మడుకి అవకాశాలు రాలేదు.సోషల్ మీడియాలో తన ఘాటు అందాలతో ఫోటోషూట్ లు చేసుకొని అందరికి అందుబాటులో ఉంటున్న ఈ భామకి మరల రవితేజ రూపంలోనే అదృష్టం వరించింది.
ఈ సినిమా తర్వాత వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.ఈ సినిమా హీరోయిన్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తుంది.