భారతదేశం మొత్తం కూడా హిందీ నేర్చుకోవాల్సిందే అనే రూలును కేంద్ర మంత్రి అమిత్ షా తీసుకు వచ్చే ఆలోచనల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఇటీవల రెండు మూడు కార్యక్రమాలోల ఆయన ఈ విషయాన్ని వెళ్లడించాడు.
భారతదేశం మొత్తం ఏకత్వంతో ఉండాలనే ఉద్దేశ్యంతో హిందీ భాషను తప్పనిసరి చేయాలని అమిత్ షా భావిస్తున్నారు.కాని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తాజాగా మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కేంద్ర తీసుకు రావాలని భావిస్తున్న హిందీ భాషను తాము వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించాడు.
తాము ఎప్పటికి కూడా హిందీ భాషను స్వీకరించబోం అంటూ ప్రకటించాడు.ఒకవేళ బలవంతంగా కనుక హిందీ భాషను రుద్దాలని చూస్తే తమిళులు చూస్తూ ఊరుకోరు అంటూ హెచ్చరించాడు.
జల్లి కట్టు కోసం తమిళులు చేసినది కేవలం నిరసన మాత్రమే.మాతృ భాష కోసం తమిళులు యుద్దం చేసేందుకు కూడా సిద్దం అవుతారంటూ కమల్ హెచ్చరించాడు.
దేశంకు స్వాతంత్య్రం వచ్చినప్పుడే భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఇండియాను ప్రకటించుకున్నాం.ఇప్పుడు షా వచ్చి దీన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే ఎవరు ఊరుకుంటారు అంటూ కమల్ అన్నాడు.