తమ పార్టీ గుర్తుపై సంతోషం వ్యక్తం చేసిన కమల్ హాసన్

తమిళనాడులో ఎన్నికలు కు సమయం దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ పార్టీ లు ప్రచారంలో జోరుగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో మక్కల్నిధి మయ్యం పార్టీ అద్యక్షుడు కమల్ హాసన్ కూడా ప్రచారం ను మొదలు పెట్టాడు.2019 లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ టార్చ్ లైట్ గుర్తుపైనే పోటీచేశాడు.ఇప్పుడు అదే గుర్తును రాబోయే అసెంబ్లి ఎన్నికల్లో మక్కల్ నిధి మయ్యం పార్టీ కి కేటాయిస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

 Makkal Needhi Maiam Party Symbol Is Tourch Light ,mgr Makkal, Vishwanath,torch L-TeluguStop.com

ఈ గుర్తును ఎం‌జి‌ఆర్ మక్కల్ కచ్చి అనే రాజకీయ పార్టీ కి కూడా కేటాయించడంపై కమల్ హాసన్ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించాడు టార్చ్ లైట్ గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ను కోరాడు.

ఈ నేపథ్యంలో ఎం‌జి‌ఆర్ మక్కల్ కచ్చి అధినేత ఎం‌జి‌ఆర్ విశ్వనాథన్ కేంద్ర ఎన్నికల సంఘం కు లేఖ రాస్తూ ఎం‌జి‌ఆర్ విగ్రహం గాని ఆయనకు సంబందించిన ఏ గుర్తునైనా తమ పార్టీ కి ఇవ్వాలను కోరాడు.

టార్చ్ లైట్ గుర్తు తమ పార్టీకి దక్కడంపై కమల్ హాసన్ సంతోషం వ్యక్తం చేశాడు.టార్చ్ లైట్ గుర్తు అనేది అణగారిన ప్రజల జీవితంలో వెలుగునింపేదానికి సంకేతం అన్నారు.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పుట్టిన రోజునాడు ఈ గుర్తు దక్కడం ఆనందం గా ఉంది అన్నాడు.ఈ విషయాన్ని కమల్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube