హైదరాబాద్ లోని నాచారంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేసారు.
సైబరాబాద్,రాచకొండ పరిధి లోని ఫార్మా కంపెనీలలో ఈ డ్రగ్స్ మాఫియా నడుపుతున్నట్లు తెలుస్తుంది.కెటామిన్ అనే డ్రగ్ ని వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
తొలుత బెంగుళూరు లో ఒక డ్రగ్ నిందితుడిని పట్టుకున్న అధికారులు అతడి సమాచారం తో హైదరాబాద్ లోని నాచారంలోని ఒక ల్యాబ్ లో ఈ డ్రగ్స్ ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.అయితే ఈ డ్రగ్ ని యువతుల పై ప్రయోగించేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ డ్రగ్ ని కూల్ డ్రింక్స్ లో కలిపి యువతులకు ఇచ్చి స్పృహ కోల్పోయిన తరువాత అత్యాచారాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు అంటున్నారు.దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఒక ల్యాబ్ లో ఈ డ్రగ్స్ మాఫియా నడుస్తుండడం తో ఆ ల్యాబ్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు.దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.