ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ సినిమాలంటే కోలీవుడ్ ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి.ఇక ఈయనకు తెలుగులో కూడా కొద్దిగొ గొప్పో మార్కెట్ అయితే ఉంది.
ఈయన డబ్బింగ్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే చాలు.ఆశించిన కలెక్షన్స్ వస్తాయి.
ఇక ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.
ప్రెజెంట్ విజయ్ నటిస్తున్న సినిమా ‘వారిసు‘.
ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
అలాగే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ కూడా సంచలనం క్రియేట్ చేస్తుంది.
ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.మొదటిసారి విజయ్, రష్మిక జంటగా నటించడం వల్ల ఈ జోడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
అందరి కంటే ముందుగానే దిల్ రాజు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.మేకర్స్ జనవరి 11న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అని ప్రకటించారు.అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ పై గత రెండు రోజుల నుండి గందరగోళం నెలకొంది.
దీంతో ఈ రోజు ఉదయం దిల్ రాజు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి ఈ సినిమా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో తమిళ్ లో రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వనుంది.