స్పెయిన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం లో జర్మనీ కి చెందిన ఒక ప్రముఖ వాణిజ్య వేత్త కుటుంబం సభ్యులంతా దుర్మరణం పొందినట్లు తెలుస్తుంది.
స్పెయిన్ లోని మజొర్కా దీవిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.గాల్లో ఎగురుతున్న ఒక హెలికాఫ్టర్ ని లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.జర్మనీ కి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త ఆగస్ట్ ఇన్సెల్కమ్మర్ జూనియర్,ఆయన భార్య క్రిస్టినా,వారి పిల్లలు మ్యాక్స్(11),సోఫియా(9) కలిసి ఆగస్ట్ 43 పుట్టిన రోజు నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నాం మజోర్కా దీవిలోని ఓ రెస్టారెంట్కు హెలికాప్టర్లో బయల్దేరారు.
అదే సమయంలో బిన్నిస్సాలెమ్ ఎయిరోడ్రోమ్ నుంచి జౌన్ జోస్ విడల్, అతడి స్నేహితుడు రెండు సీట్ల ఎయిర్క్రాఫ్ట్లో నింగిలోకి ఎగిరారు.
విమానం టేకాఫ్ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయిన విడల్.ఎదురుగా వెళ్తున్న ఆగస్ట్ హెలికాప్టర్ను ఢీకొట్టింది.దీంతో క్షణాల్లో విమానం, హెలికాప్టర్లు అగ్నిగుండంలా మారడం తో అందరూ ఆ మంటలలో కాలి బూడిద అయిపోయారు.
స్థానికులు నీటి పంపులతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు.