గత నెలలో విడుదలైన ఎఫ్3 సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లను అందుకుంటున్న సమయంలోనే మేజర్, విక్రమ్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.
అడివి శేష్ హీరోగా మహేష్ ఒక నిర్మాతగా సందీప్ ఉన్నికృష్ణన్ కథతో తెరకెక్కిన సినిమా కావడంతో మేజర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగాయి.
ఈ సినిమా తొలిరోజు 13.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.అడివి శేష్ కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమా 7.12 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం.నైజాంలో ఈ సినిమా కోటీ 75 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించగా ఓవర్సీస్ లో 2 కోట్ల 35 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.
ఇతర ఏరియాలలో ఈ సినిమాలకు పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దర్శకుడిగా శశికిరణ్ కు ఈ సినిమా ప్లస్ అయింది.ఫస్ట్ వీకెండ్ నాటికి మేజర్ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.కలెక్షన్ల విషయంలో తెలుగు రాష్ట్రాల వరకు అడివి శేష్ నటించిన మేజర్ పైచేయి సాధించడం గమనార్హం.
ఈ సినిమాలతో పాటు విడుదలైన అక్షయ్ కుమార్ సినిమాకు కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.