భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లో ఈ ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీ గా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.చాలా ఘోరంగా జరిగిన ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్ మొత్తం నల్లటి పొగలు కమ్మింది.
అయితే అసలు ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దానిపై ఎలాంటి వివరణ లేదు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
.