దేశంలో అతిపెద్ద అసెంబ్లీ సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో యూపీ లో జరగబోయే ఎన్నికలలో… దాదాపు 100 స్థానాల్లో పోటీ చేయడానికి మజ్లిస్ పార్టీ రెడీ అవుతుంది.
గతంలో హైదరాబాద్ పాతబస్తీకి పరిమితంగా ఉండే ఈ పార్టీ.రానురాను దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలలో విస్తరిస్తూ ఉంది.
ముస్లిం ఓటు బ్యాంకునే ఆయుధంగా ఎంఐఎం… మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల పోటీ చేసి సత్తా చాటడం జరిగింది.ఈ క్రమంలో ముస్లిం ప్రాబల్యం ఉన్న చోట్ల అన్ని స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో.
ఓట్లను భారీగా చీల్చింది.ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో యూపీ ఎన్నికలలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ ప్రకటన.
ఇప్పుడు జాతీయ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.మరోపక్క ఈ ఎన్నికలలో యూపీలో అధికారంలో ఉన్న బిజెపి ని గట్టిగా దెబ్బతీయాలని.
మిగతా పార్టీలు గట్టిగానే వ్యూహాలు వేస్తున్నాయి.
ఇటీవల యూపీలో జరిగిన స్థానిక ఎన్నికలలో.మోడీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇతర పార్టీలు గెలవటం మాత్రమే కాక సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గంలో కూడా.బిజెపి ఓడిపోవడం జరిగింది.
దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా బిజెపిని ఓడించాలని.దేశంలో మిగతా పార్టీలు భారీ వ్యూహాలు ఇప్పటినుండే వేస్తున్నాయి.