యంగ్ హీరో శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే వరుసగా సక్సెస్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న శర్వా, ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.
కాగా ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న జాను చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు ఈ హీరో.ప్రస్తుతం విలేజ్ బ్యాక్డ్రాప్లో శ్రీకారం అనే సినిమాను తెరకెక్కిస్తున్న శర్వానంద్, ఆ తరువాత ఓ మల్టీ్స్టారర్ చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు.
ఆర్ఎక్స్ 100 చిత్రంతో అదరగొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి, తన నెక్ట్స్ చిత్రంగా మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తోండగా ఆయనకు జోడీగా ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ సినిమాలో తొలుత స్టార్ హీరోయిన్లను తీసుకుందామని చిత్ర దర్శకుడు భావించాడు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాలు మానేశాడు.ఇక తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా ‘మజిలీ’ చిత్ర హీరోయిన్ను ఎంపిక చేశాడట.అయితే మజిలీ చిత్రంలో నటించిన సమంతను ఈ సినిమా కోసం తీసుకోలేదు.
అదే చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించిన దివ్యాన్షా కౌషిక్ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడట దర్శకుడు అజయ్ భూపతి.ఇటీవల ఈ సినిమా కథను ఆమెకు వినిపించగా, ఇందులో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఏదేమైనా శర్వానంద్ సరసన ఈ బ్యూటీ అయితే బాగుంటుందని దర్శకుడు అజయ్ భూపతి ఫిక్స్ కావడంతో ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.