తిరుపతి ఉప పోరుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.మరో రెండు నెలలు గడువు ఉన్నప్పటికీ.
ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాదరావు.
హఠాన్మరణం చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇలాంటి పరిస్థితిలో ఇతర పార్టీలు పోటీ నుంచి దూరంగా ఉంటాయి.
సానుభూతి చూపిస్తాయి.అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలూ ఇక్కడ పోటీకి సై అంటున్నారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది.ఈ క్రమంలో సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించింది.ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వడమో.దుర్గాప్రసాద్ కుటుంబానికి అవకాశం ఇవ్వడమో జరుగుతుందని అనుకున్నారు.అయితే.వైసీపీ అధినేత, సీఎం జగన్ తిరుపతి ఉప పోరుకు సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
గతంలో తానుపాదయాత్ర చేసిన సమయంలో తనకు ఫిజియోథెరపిస్ట్గా సేవలు అందించిన డాక్టర్ గురుమూర్తికి జగన్ ఇక్కడ టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసింది.రాజకీయంగా గురుమూర్తి కొత్త.
ఆయనకు రాజకీయాల వాసనలు తెలియవు.అయితే.
జగన్ తన పాదయాత్రలో ఉన్న సమయంలో డాక్టర్ గురుమూర్తి ఆయనకు సేవలు అందించారు.ఈ సమయంలోనే భవిష్యత్తులో మంచి పొజిషన్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు తిరుపతి ఉప పోరుకు సంబంధించి ఆయనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.త్వరలోనే దీనిపై వైసీపీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదిలావుంటే.టీడీపీ తరఫున అభ్యర్థి ఖరారయ్యారు.ఇక, వైసీపీ తరఫున కూడా అభ్యర్ధి ప్రకటనే తరువాయి అంటున్నారు.మరి మిగిలింది.
రెండు ప్రధాన పార్టీలు.వీటిలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి.
ఈ రెండు పార్టీల తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే విషయం చర్చకు వస్తోంది.కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ చింతా మోహన్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక, బీజేపీ అభ్యర్థి విషయం కూడా ఇంకా ఫైనల్ కాలేదు.అయితే.ప్రధాన పోరు.మాత్రం టీడీపీ , వైసీపీల మధ్యే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.కానీ.టీడీపీ తరఫున మళ్లీ పనబాక లక్ష్మినే ఎంపిక చేయడంపై తిరుపతిలో సానుకూల పవనాలు వీయకపోవడం గమనార్హం.
అంతేకాదు.ఆమె కూడా యాక్టివ్గా ఉండే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
మొత్తానికి వైసీపీ అభ్యర్థి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపినా.విజయం ఖాయమనే అంటున్నారు పరిశీలకులు.