సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమా ‘ఒక్కడు’ అని అందరికీ తెలుసు.ఈ సినిమా సరిగ్గా 2003వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 వ తారీఖున రిలీజ్ అయింది.
ఆ టైంలో రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి.
‘ఒక్కడు’ సినిమా విజయంతో మహేష్ కి మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో ఏర్పడటం జరిగింది.
అటువంటి సినిమా రిలీజ్ అయ్యి 18 సంవత్సరాలు అయిన నేపథ్యంలో.మహేష్ భార్య నమ్రత ఈ సినిమాని ఉద్దేశించి ఇంస్టాగ్రామ్ లో .“ఒక్కడు” నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అని పోస్ట్ పెట్టడమే కాక డైరెక్టర్ గుణశేఖర్ అదేవిధంగా మిగతా యూనిట్ సభ్యుల పేర్లు ప్రస్తావించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.అయితే ఈ సందర్భంలో నిర్మాత ఎమ్మెస్ రాజు పేరు ఆమె మర్చిపోయింది.ఈ నేపథ్యంలో ఎమ్మెస్ రాజు ఈ విషయాన్ని గమనించి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అయినా పర్లేదు.
నేను నిర్మించిన సినిమా క్లాసికల్ అంటూ నమ్రతా కి నచ్చటం సంతోషం ఉంది అని చెప్పుకొచ్చారు.దీంతో వెంటనే పొరపాటు గ్రహించిన నమ్రత.వెంటనే సరిదిద్దుకునే రీతిలో ఎమ్మెస్ రాజు పేరును తన ఇంస్టాగ్రామ్ పోస్టులో చేర్చింది.
.