పవన్ కళ్యాణ్ మామిడి కాయల సీజన్లో తన సన్నిహితులకు మిత్రులకు మామిడి పండ్లను వారి ఇంటికి పంపిస్తూ ఉంటాడు.ఇది ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఆ సాంప్రదాయాన్ని మహేష్బాబు ఫాలో అయ్యాడు.తాజాగా దీపావళి సందర్బంగా బహుమతులను సన్నిహితులకు ఇచ్చాడు మహేష్బాబు.
అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు క్రిష్కు కూడా మహేష్బాబు గిఫ్ట్ ప్యాక్ను పంపించి ఆశ్చర్యపర్చాడు.ప్రస్తుతం మహేష్బాబు లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి.
గతంలో ఇలాంటి విషయాలకు చాలా దూరం ఉండే మహేష్ ఇప్పుడు ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు.
క్రిష్తో పాటు ఇండస్ట్రీలో తనకు సన్నిహితులు అయిన పలువురికి మహేష్బాబు ఈ గిఫ్ట్ బుట్టలను పంపించినట్లుగా చెబుతున్నారు.
మహేష్బాబు పంపిన ఈ బుట్టతో క్రిష్ను బుట్టలో పడేసుకోవాలనే ఆలోచన ఉందా అని కొందరు లోతుగా ఆలోచిస్తున్నారు.మహేష్బాబు చాలా కాలంగా క్రిష్తో ఒక సినిమా చేయాలని భావిస్తున్నాడు.
ఆ మధ్య వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి.అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
మళ్లీ ఇప్పుడు ఈ బుట్టల వ్యవహారంతో మళ్లీ ఆ సినిమా గురించి ప్రచారం మొదలైంది.చూద్దాం ఈ దీపావళి గిఫ్ట్ బుట్ట వీరి కాంబినేషన్లో మూవీని తీసుకు వస్తుందేమో.!
.