సూపర్ స్టార్ మహేష్ బాబు.సినిమాల్లోనూ.
రియల్ లైఫ్ లోను ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.ఏ పండుగ వచ్చిన తన కుటుంబంతో ఎంతో ఘనంగా జరుపుకుంటాడు మహేష్ బాబు.
ఇక అలానే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే మహేష్ తన పిల్లలతో జరుపుకున్న సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయ్. తన పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయ్.ఇక ఆ ఫోటోలలో మహేష్ బాబు కూడా చిన్న పిల్లాడి లా మారిపోయాడు.తన పిల్లలు సితార, గౌతమ్ లతో సరదాగా తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.తాజాగా మహేష్ కు సంబంధించిన ఈ ఫోటోని దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఆ ఫొటోలో మహేష్ బాబు, సితార, గౌతమ్ తో పాటు మెహర్ రమేష్ ఎంతో సరదాగా ఉన్న ఫోటో అది.
ఇక ఆ ఫోటోను షేర్ చేసిన మెహర్ రమేష్.”మహేష్ బాబు సూపర్ స్టార్ హీరో.కానీ ఆయన లోనూ ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు.ఈ 2020 ఫన్, ఫ్రెండ్షిప్ తో గుడ్ బై పలుకుతూ.2021 కి వెల్కమ్ చేతున్నట్టు” చెప్పుకొచ్చారు.ఇక ఈ ఫోటోతో పాటు మెహర్ రమేష్ చెప్పిన కోట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.కాగా సినీ సెలబ్రెటీస్ అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ గత రెండు రోజుల నుంచి గోవాకి , మాల్దీవ్స్ కు వెళ్లారు.
అక్కడికి వెళ్లిన ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్.