టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఖాతాలో వరుస ఆఫర్ లను జమ చేసుకుంటున్నాడు.ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడ్డాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు మహేష్.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నట్లు అందరికీ తెలిసిందే.
అంతే కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నందున.ఈ ఏడాది మహేష్ సినిమాకు విజయదశమి రోజు పూజా కార్యక్రమానికి ప్రారంభించాలని.ఈ ఏడాది చివర్లోనే సెట్ లోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు సినిమా అంటే అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు 28వ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ లో నిర్మించబడనుంది.ఇప్పటికే ఈ సినిమా గురించి పలు చర్చలు జరుగుతుండగా తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే బ్యూటీ కోసం బాగా ఆసక్తిగా మారింది.
ఇక ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ను డిసైడ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదివరకే మహేష్ బాబుతో ఈ ముద్దుగుమ్మ నటించగా.మరోసారి త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో ఈ బ్యూటీనే తీసుకోనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం పూజ మరో సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.