కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అన్ని పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకు అన్నీ ఆగమై పోయాయి.ఇక స్టార్ హీరోల సినిమాలు అందరికంటే ముందే వాయిదా పడుతూ వచ్చాయి.
షూటింగ్ ప్రారంభం కావాల్సిన సినిమాలు సైతం ఆగిపోవడంతో అవి మరింత వాయిదా పడుతున్నాయి.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని గీతాగోవిందం దర్శకుడు పరశురాం డైరెక్షన్లో ప్రారంభించాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా మళ్లీ వాయిదా పడింది.
ఇక ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభం అవుతుందో లేదో అనే ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు.
కానీ మహేష్ బాబు మాత్రం ఎలాంటి ఆందోళన పడకుండా ఇంటికే పరిమితం అయ్యాడు.
తన కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు.ప్రస్తుతానికి సినిమాల గురించి ఏం ఆలోచించకుండా తన కుటుంబ సంరక్షణనే తనకు ముఖ్యమని, ఫ్యాన్స్ కూడా తమ కుటుంబాలను కాపాడుకోవాలని, ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని మహేష్ చెప్పుకొచ్చాడు.
ఇక కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి మహేష్ పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన సంగతి తెలిసిందే.