దేశంలో కరోనా శాస్త్రవేత్తల, వైద్యుల అంచనాలను మించి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కరోనా వైరస్ సోకకుండా ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కొంతమంది వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితమవుతున్నారు.
ఇంట్లో ఒక్కరికి కరోనా సోకినా మిగిలిన వాళ్లకు కూడా కరోనా బారిన పడుతున్నారు.
అయితే మహేష్ బాబు భార్య నమ్రత కరోనా వైరస్ సోకకుండా, కరోనా సోకినా త్వరగా కోలుకునేలా కొన్ని టిప్స్ ఇచ్చారు.
నమ్రత ఇచ్చిన టిప్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.పెళ్లికి ముందు సినిమాల్లో నటించిన నమ్రత పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.అయితే నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు ఇతర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఎవరైతే ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చేస్తారో వాళ్లకు కరోనా సోకే అవకాశాలు తక్కువని నమ్రత తెలిపారు.
ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చేసేవాళ్లకు కరోనా సోకినా వాళ్లు త్వరగా వైరస్ నుంచి కోలుకుంటారని నమ్రత పేర్కొన్నారు.ప్రతిరోజూ వ్యాయామం ద్వారా శరీరానికి శ్రమ కల్పిస్తే కరోనా నుంచి బయటపడటం తేలికేనని నమ్రత వెల్లడించారు.
మరోవైపు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం షూటింగ్ లపై గట్టిగానే పడింది.
ఏప్రిల్, మే నెలలలో విడుదల కావాల్సిన సినిమాలలో ఎక్కువ సినిమాలు వాయిదా పడ్డాయి.మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై కూడా కరోనా ప్రభావం బాగానే పడుతోంది.జులై చివరి వారం వరకు ఇదే స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో చూడాల్సి ఉంది.