సూపర్ స్టార్ కృష్ణ ‘శ్రీ శ్రీ’ చిత్రంలో చాలా కాలం తర్వాత నటిస్తున్న విషయం తెల్సిందే.కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.
‘శ్రీ శ్రీ’ చిత్రంలో కృష్ణతో పాటు మహేష్బాబు నటించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాడు.మహేష్బాబు చిన్న గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లుగా వార్తలు రావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇదే చిత్రంలో మహేష్బాబు తనయుడు గౌతం సైతం చిన్న గెస్ట్ రోల్లో నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి.దాంతో చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ఈ చిత్రంలో మహేష్బాబు మరియు గౌతంలు నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
‘శ్రీశ్రీ’ చిత్రంలో మహేష్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.మహేష్బాబు గెస్ట్ రోల్లో నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
కాని తాజాగా ఈ చిత్రంలో మహేష్బాబు నటించడం లేదు అని తేలిపోవడంతో ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.ప్రస్తుతానికి ‘శ్రీ శ్రీ’లో మహేష్ ఫిక్స్ కాలేదు కాని, తర్వాత అయినా మహేష్బాబు నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరి ఫ్యాన్స్ కోరికను మహేష్బాబు తీర్చుతాడా అనేది చూడాలి.వేసవిలో ‘శ్రీ శ్రీ’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్బాబు నటిస్తున్నాడు.