సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేస్ లో 20 మంది సెలబ్రిటీస్ తో సర్కారు వారి పాట టీం ఓ క్రేజీ ప్రోగ్రాం నిర్వహించింది.అందులో పాల్గొన్న వారంతా కూడా మహేష్ గురించి వారి అభిప్రాయాలు.
వారు పనిచేస్తున్న ప్రాజెక్ట్ ల గురించి చెప్పారు.ఈ క్రమంలో మహేష్ కు మహర్షి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
మహేష్ తో తన సినిమా కన్ఫర్మ్ చేస్తూ చెప్పారు వంశీ పైడిపల్లి.మహర్షి తర్వాత మహేష్, వంశీ సినిమా ఉండాల్సింది కాని కుదరలేదు.
ప్రస్తుతం విజయ్ కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు.
అంతేకాదు ఈ సినిమాలో మహేష్ మాస్ క్యారక్టరైజేషన్ ఉంటుందని రివీల్ చేశారు.మొత్తానికి మహర్షి కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని తెలిసి ఘట్టమనేని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.
మరి మహేష్ కు ముందు వినిపించిన కథనే మార్చి రాశాడా లేక కొత్త కథతో మహేష్ ను మెప్పిస్తాడా అన్నది తెలియదు కాని వంశీ పైడిపల్లితో మహేష్ మూవీ అనగానే ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది.