సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తుంది.
సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఒకటి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమాలో విలన్ గా ఒక బాలీవుడ్ స్టార్ నటిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.
అది కూడా అలాంటి ఇలాంటి స్టార్ కాదు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మహేష్ కు విలన్ గా తీసుకోవాలని చూస్తున్నారట.ఈ వార్తల్లో ఎంతవర్కు ఉందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేసినట్టు టాక్.మహేష్, త్రివిక్రం ఇద్దరు కలిసి ఈసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది.త్రివిక్రం సినిమా పూర్తి కాగానే జక్కన్న సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని టాక్.
రాజమౌళి, మహేష్ కాంబో మూవీని కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్నారు.