సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట తర్వాత తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం శ్రీనివాస్ తో చేస్తున్నాడని తెలిసిందే.హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.
సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసి త్రివిక్రం సినిమాను సమ్మర్ నుండి స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు మహేష్.ఈలోగా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సెట్ చేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో కం విలన్ సునీల్ శెట్టిని ఫిక్స్ చేసినట్టు టాక్.
హిందీతో పాటుగా తెలుగు సినిమాల్లో కూడా మెరుస్తున్నారు సునీల్ శెట్టి, మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమాలో నటించారు.
ఇప్పుడు మహేష్ సినిమాలో విలంగ చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్.పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కార్ వారి పాట ఏప్రిల్ రిలీజ్ అనుకుంటున్నారు.
సమ్మర్ లో త్రివిక్రం సినిమా మొదలుపెట్టి 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఉంటుందని తెలుస్తుంది.
ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ గ్యాప్ వచ్చింది కాబట్టి మహేష్ తో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సెట్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి.