సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’.ఈ సినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.
ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్న మొన్నటి దాకా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.
ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెగ్యురల్ షూట్ కూడా మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసారు.అయితే సెకండ్ షెడ్యూల్ వెంటనే స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే అనుకోని అండ్డంకుల వల్ల మళ్ళీ వాయిదా పడింది.
ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక రెండు నెలల క్రితం వాయిదా పడిన ఈ సినిమా షూట్ ఇప్పుడు జనవరి 18 నుండి స్టార్ట్ కాబోతున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
మరి తాజాగా ఈ సినిమా షూట్ గురించి అప్డేట్ వచ్చింది.
మరి తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ అదిరే యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ చేస్తున్నారట.ఇక ఈ యాక్షన్ బ్లాక్ ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జరగనుందట.ఈ యాక్షన్ బ్లాక్ రెండు వారాల పాటు సాగుతుంది అని తెలుస్తుంది.
మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ బాబుతో నాన్ స్టాప్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసాడు.చూడాలి ఈ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఎలా అలరిస్తుందో.