మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మహేష్ ఫుల్ జోష్ లో ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.
కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోతూ వస్తుంది.లాక్ డౌన్ తర్వాత దుబాయ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు.
అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ఒక్కొక్క సినిమా వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఇదే లిస్టులోకి మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా చేరిపోయింది.
ఈ నెల 15 నుండి హైదరాబాద్ లో జరగాల్సిన షూటింగ్ క్యాన్సిల్ చేసారు.ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజులపాటు చేయాలనీ చిత్ర యూనిట్ భావించారు.
కానీ కేసులు ఎక్కువవుతుండడం వల్ల మహేష్ బాబు షూటింగ్ పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
పరశురామ్ ఈ సినిమాను సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్నాడు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన భారీ కుంభ కోణాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తారని టాక్.ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఫిలిం సిటీలో భారీ బ్యాంకు సెట్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత మళ్ళీ మహేష్ బాబు ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నాడట.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.