అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నికేవ్వరు.చాలా రోజుల తరువాత ఈ సినిమా ద్వారా మహేష్ ఫుల్ గా ఎంటర్టైనర్ చేయనున్నాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ లో సరికొత్త కామెడీ యాంగిల్ ని చూపించనున్నాడు.
ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేసే పనిలో పడింది.ఇక సినిమాలో ట్రైన్ రైడ్ కి సంబంధించిన సీన్స్ స్పెషల్ ఎట్రాక్ట్ గా నిలవనున్నాయట.20 నిమిషాల పాటు రైలు కామెడీ ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తోంది.టాప్ కమెడియన్స్ ఈ సీన్స్ లో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కి సంబంధించిన సీన్స్ పూర్తి చేయడంలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.
మరి ఆ సన్నివేశాలు ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.ఏకే ఎంటర్టైన్మెంట్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తూన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.