టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన నెక్ట్స్ మూవీని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ‘సర్కారు వారి పాట’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
కాగా ఈ సినిమా తరువాత మహేష్ ఓ భారీ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ చిత్రం రాబోతుందని ఇటీవల రాజమౌళి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఆర్ఆర్ఆర్పైనే పెట్టాడని, ఆ సినిమాను 2021లో రిలీజ్ చేసి ఆ తరువాత మహేష్ చిత్రంపై ఫోకస్ పెడతాడు.ఈ లెక్కన జక్కన కథ పూర్తి చేసి సినిమా షూటింగ్ ప్రారంభించాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.
దీంతో మహేష్ రాజమౌళి చిత్రానికంటే ముందే మరో రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో పాటు మరో డైరెక్టర్తో సినిమాలు చేశాక రాజమౌళి సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.
ఈ లెక్కన మహేష్-రాజమౌళి కాంబో చిత్రం ఏకంగా 2024 లేదా 2025లో పట్టాలెక్కే సూచన కనిపిస్తోంది.అంటే మరో ఐదేళ్ల వరకు రాజమౌళితో మహేష్ సినిమాను మనం చూడలేకపోవచ్చనేది వాస్తవం అంటున్నారు సినీ క్రిటిక్స్.