ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.రాం చరణ్ తో షో మొదలు పెట్టిన తారక్ మహేష్ తో సీజన్ ముగిస్తున్నారని తెలుస్తుంది.
ఇక కొన్నాళ్ల క్రితమే మహేష్ ఈ.ఎం.కే ఎపిసోడ్ పూర్తి కాగా ఇంకా దాన్ని టెలికాస్ట్ చేయలేదు.త్వరలో అంటూ ఊరిస్తూ ఫ్యాన్స్ ను ఎక్సయిట్ చేస్తూ వచ్చారు.
ఇక లేటెస్ట్ గా ఆ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ డేట్ లాక్ చేశారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్.
టి.ఆర్, మహేష్ ఈ.ఎం.కే ఎపిసోడ్ డిసెంబర్ 4న టెలికాస్ట్ అవుతుందని తెలుస్తుంది.
డిసెంబర్ 4న రాత్రి ఈ షో వస్తుందని తెలుస్తుంది.సరదా సరదాగా సాగే ఈ షోలో ఎన్.టి.ఆర్ అడిగే ఆసక్తికరమైన ప్రశ్నలకు మహేష్ అదిరిపోయే ఆన్సర్స్ షోని రసవత్తరంగా మారేలా చేస్తాయని తెలుస్తుంది.కచ్చితంగా ఈ ఎపిసోడ్ టి.ఆర్.పి రేటింగ్ మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు.ముఖ్యంగా తారక్, మహేష్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ను రికార్డ్ వ్యూస్ రాబట్టాలని చూస్తున్నారు.
ఈ షోలో మహేష్ పాతిక లక్షల దాకా ప్రైజ్ మనీ గెలుచుకున్నారని తెలుస్తుంది.