సాయి తేజ్‌కు ప్రమాదం జరిగింది ఇలా.. ఎన్టీఆర్ పీఆర్వో ఫైర్!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇటీవలే సెప్టెంబర్ 10 శుక్రవారం రోజున రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడంతో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది.

 Mahesh Koneru Reaction On Sai Dharam Tej Accident,  Mahesh Koneru, Sai Dharam Te-TeluguStop.com

ఇక శరీరములో పలుచోట్ల గాయాలవ్వగా ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీంతో ఆయన ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ప్రమాదం గురించి బాగా చర్చలు చేస్తున్నారు.

అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ కామెంట్లు పెట్టడంతో.ఈ విషయం గురించి ఎన్టీఆర్ పీఆర్ఓ ఫైర్ అయ్యాడు.

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పీఆర్ఓ మహేష్ కోనేరు తాజాగా ఈ విషయం గురించి స్పందించాడు.అంతేకాకుండా తన సోషల్ మీడియా వేదికగా సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన వీడియోను పంచుకుంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

పెద్ద వాహనాల గురించి తెలియని చాలామంది మిడిమిడి జ్ఞానంతో తమకు నచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యాడు.సాయి ధరమ్ తేజ్ అతి వేగంగా, బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదు అంటూ.

అక్కడ రోడ్డు పై ఇసుక ఉండటం వల్ల అలా ప్రమాదం జరిగిందని తెలిపాడు.

రోడ్డుపై ఇసుక ఉండటంతో ముందు వెళ్తున్న వాహనాలు స్లో అయ్యాయని.సాయి నెమ్మదిగా పక్క నుంచి వెళ్లాలనుకున్న సమయంలో అక్కడ ఉన్న ఇసుక జారడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని.ఎంతటి రేజర్ కైనా ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని తెలిపాడు.

అంతేకానీ అతడికి తన వేగం వల్ల జరగలేదని.పైగా హెల్మెట్ కూడా పెట్టుకొని ఉన్నాడు అంటూ తెలిపాడు.

ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడంతో అతడికి, అతడి కుటుంబానికి భంగం కలిగించ వద్దు అంటూ తెలిపాడు మహేష్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube