సూపర్ స్టార్ మహేష్ బాబు ఈనెల 27వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను కలవడానికి రెడీ అయ్యారు.ఆరోజు హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ లో కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కృష్ణ పెద్దకర్మ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు మరియు ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
అయితే కృష్ణ మరణించిన నాడు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు చుట్టుప్రక్కల రాష్ట్రాలకు చెందిన అభిమానులు భారీ ఎత్తున పద్మాలయ స్టూడియోస్ కి చేరుకున్నారు.
కానీ క్రౌడు ఎక్కువగా కావడంతో పాటు.
అప్పటికే సాయంత్రం అవ్వడంతో గచ్చిబౌలికి తీసుకెళ్లాలనుకున్న భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్ లోనే పెట్టడం జరిగింది.వాస్తవానికి అభిమానుల సందర్శనార్థం కడసారి చూపు కోసం గచ్చిబౌలిలో పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయగా చివరిలో క్యాన్సిల్ అయింది.
దీంతో అభిమాన నటుడిని అభిమానులు కడసారి చూసుకోలేకపోయారు.ఇలాంటి తరుణంలో కృష్ణ పెద్దకర్మ రోజున అభిమానులను ప్రత్యేకంగా కలవడానికి మహేష్ రెడీ కావడం జరిగింది.
దీంతో సూపర్ స్టార్ మహేష్ మరియు కృష్ణ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరుకానున్నట్లు సమాచారం.ఒకే ఏడాది కుటుంబంలో ముగ్గురు కోల్పోవడంతో మహేష్ బాబు కోసం.
భారీ ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.