మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా గురించి చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.బాహుబలి చిత్రం తర్వాత మహేష్బాబుతో సినిమా చేస్తానంటూ ఆమద్య జక్కన్న ప్రకటించాడు.
అయితే అనూహ్యంగా ఆయన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లతో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ చిత్రం షూటింగ్ కూడా మొదలు అయ్యింది.
ఇదే సమయంలో మహేష్బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజమౌళితో ఒక సినిమాను చేస్తాను అని, దాని ప్రకటన త్వరలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఈ విషయమై మహేష్బాబు మరింతగా మాట్లాడుతూ… రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.
కథ చర్చలు పూర్తి అయ్యేందుకు సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు.తనకు పౌరాణిక పాత్రలు అంటే అస్సలు ఆసక్తి లేదు.
కాని రాజమౌళి కోరితే మాత్రం తప్పకుండా అలాంటి పాత్రలో నటిస్తానంటూ మహేష్బాబు చెప్పుకొచ్చాడు.మహేష్బాబు కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క పౌరాణిక పాత్రలో కూడా నటించలేదు.
కనీసం చిన్న గెటప్ కూడా వేయలేదు.దాంతో మహేష్ను ఒకసారి అలా చూడాలని జనాలు ఉవ్విల్లూరుతున్నారు.
మహేష్బాబు తన 25వ చిత్రంను మే 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంతో మహేష్బాబు మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక ఈ చిత్రం ప్రమోషన్ సమయంలో మహేష్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.