టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటించిన చిత్రం సర్కారీ వారి పాట. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా రావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకొన్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశారంటూ మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు నివేదికల ప్రకారం మహేష్ బాబు సినీ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించలేని ఓపెనింగ్స్ ఈ సినిమా సాధించిందని చెబుతున్నారు.
కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని న్యూస్ చానల్స్ ఉద్దేశపూర్వకంగా ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మహేష్ అభిమానులు సదరు న్యూస్ ఛానల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా పచ్చి బూతులు తిడుతూ ఆ న్యూస్ ఛానల్ లో భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ఈ విధంగా న్యూస్ ఛానల్ పై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన న్యూస్ ఛానల్ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.ఇలా న్యూస్ ఛానల్ పాజిటివ్ రివ్యూ ఇచ్చినప్పటికీ మహేష్ బాబు అభిమానులు మాత్రం ట్రోలింగ్ ఆపడం లేదు.తమ హీరో సినిమా గురించి ఇలాంటి ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలై మూడు రోజులు కాగా ఇప్పటివరకు రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని సమాచారం.