లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే.వారు అమెరికా వెళ్లే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన కూతురు, కొడుకు తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు.
ఇలా వారు అమెరికా పర్యటనలో ఉండగా వారి టూర్ లో భాగంగా దిగిన ఫోటోలను ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉన్నారు.ఇందులో భాగంగానే తాజాగా ఓ ఫ్యామిలీ పార్టీలో పాల్గొన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అక్క శిల్ప ఇంటికి వారు వెళ్లగా, అక్కడ శిల్ప భర్త అప్రేశ్ రంజిత్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బర్త్డే వ్యక్తి కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత తన సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమా తో భారీ విజయం అందుకున్న తర్వాత ఆయన పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఓ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఆయన అభిమానులు నుంచి దీనికి పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది.ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జనవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.
ఈ చిత్ర కథాంశం అమెరికా నేపథ్యంలో కొన్ని బ్యాంక్ కుంభకోణాలను తెరపైకి చూపించే విధంగా చిత్రీకరిస్తున్నారు.