సూపర్ స్టార్ మహేష్ తన స్వగ్రామం బుర్రిపాలెం ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.శ్రీమంతుడు సినిమా స్పూర్తిగా ఆంధ్రాలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
మహేష్ బాబు దగ్గర నుండి ఆ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటున్నారు.ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న మహేష్ అండ్ టీం కరోనా సంక్షోభంలో బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్య విషయం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు.
అందుకే అక్కడ వారందరికి స్పెషల్ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశాడు.గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయించి వ్యాక్సిన్ తొలి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాడు.
మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇక లేటెస్ట్ గా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది.
ఆదివారం నాడు బుర్రిపాలెం విలేజ్ లో సెకండ్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారట.మహేష్ అండ్ టీం ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగినట్టు తెలుస్తుంది.
తొలి డోస్ తీసుకున్న వారు ఈరోజు సెకండ్ డోస్ తీసుకున్నట్టు సమాచారం.ఈ కార్యక్రమానికి విజయవాడకి చెందిన ఆంధ్రా హాస్పిటల్స్ వారు సహకారం అందించారు.
బుర్రిపాలెం విలేజ్ కు వ్యాక్సినేషన్ అందించిన మహేష్ కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.