ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తో బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవీన్ పొలిశెట్టి మరోసారి జాతి రత్నాలు సినిమాతో మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా వల్ల నవీన్ క్రేజ్ మరింతగా మారింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా.మొత్తానికి నవీన్ ను యంగ్ స్టార్ గా మార్చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం తరువాత నవీన్ పొలిశెట్టి కి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.ఇక వరుస సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి.ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తునట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అంతేకాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఓ సినిమా చేయనున్నట్లు అనుకుంటున్నారట.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నవీన్ పొలిశెట్టి మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడట.
ప్రస్తుతం నవీన్ ఈ రెండు సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకోగా తాజాగా మరో ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందట.అంతే కాకుండా ఈ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాను నిర్మిస్తున్నాడట.మొత్తానికి మహేష్ బాబు జాతి రత్నం కి బంపర్ ఆఫర్ ఇచ్చాడని అర్థమవుతుంది.
ప్రస్తుతం అడవి శేషు తో మేజర్ అనే సినిమా నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా జులై 2న విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి సినిమా గురించి సమాచారాన్ని తెలియజేయనున్నారు.ఇక నవీన్ పోలిశెట్టి ఖాతాలో మూడు సినిమాలు వరుసగా ఉన్నాయని అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాల ద్వారా నవీన్ రేంజ్ ఎంతగా మారుతుందో చూడాలి.