టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి సోషల్ మీడియాలో చాలా తరుచుగా విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి.
మహేష్ బాబు కూతురు సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉండగా, ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఇప్పటికే ఒక సినిమాలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్నాడు.ఇక చివరగా మహేష్బాబు భార్య నమ్రత హీరోయిన్గా ఎప్పుడో ఆమె స్టార్ అయ్యింది.
ఈ నలుగురు ఒక ఫొటోలో కనిపిస్తేనే ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు.అలాంటిది వీరు నలుగురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే అసలు ఊహకు అందండం లేదు కదా.త్వరలో వీరు నలుగురు కలిసి నటించబోతున్నారు.సినిమాకు అయితే కాదు లే కాని ఒక యాడ్ కోసం మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కలిసి నటించబోతున్నారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యాడ్లో మహేష్ ఫ్యామిలీ కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో మహేష్బాబు ఫ్యామిలీకి మెజార్టీ వాటా ఉందని, అందుకే ఫ్యామిలీతో కలిసి నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ టాక్ వినిపిస్తుంది.అతి త్వరలోనే ఆ యాడ్ షూట్ పూర్తి అయ్యి బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించబోతుంది.దాదాపు పది నిమిషాల యాడ్లో నలుగురు కనిపించబోతున్నారు.
నిజ జీవిత పాత్రల్లోనే ఆ నలుగురు కనిపిస్తారని సమాచారం అందుతోంది.ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.