ఎస్ జే సూర్య … తెలుగులో చేసింది ఇద్దరు హీరోలతోనే.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇద్దరిని డైరెక్ట్ చేసాడు.
ఇప్పుడు ఇన్నేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ ఆ ఇద్దరితోనే పనిచేయబోతున్నాడు.ఈసారి మహేష్ సినిమాలో నటుడిగా చేయబోతోంటే, పవన్ తో సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు.
తాజాగా విడుదలైన తమిళ చిత్రం ఐరైవిలో ఎస్ జే సూర్య తన విలనిజంతో మెప్పించాడు.తన నటనకు తమిళజనాలు జైజైలు పలుకుతున్నారు.ఈ నేపథ్యంలో మహేష్ బాబు – మురుగదాస్ సినిమా మరింత ఆసక్తికరంగా మారింది.ఒక్కడు, పోకిరి తరువాత మళ్ళీ ఆ రెంజ్ హీరో-విలన్ కాంబినేషన్ సెట్ అయ్యిందని విశ్లేషకుల భావన.
ఈ సినిమాకి సూర్య విలన్ గా బాగా ప్లస్ అవుతాడు అని మహేష్ కూడా భావిస్తున్నాడట.
ఇక ఖుషి లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చినా, ఎస్ జే సూర్య అంటే అపనమ్మకం ఎక్కువ పవన్ అభిమానులకి.
ఎందుకంటే ఆ సినిమా తరువాత నటుడిగా సఫలమైన సూర్య, దర్శకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.దానికితోడు విరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ వచ్చిన కొమరం పులి చాలా పెద్ద డిజాస్టర్.
దాంతో ఈసారి మహేష్ – పవన్, ఇద్దరికి ఒకరే విలన్ అవుతారేమో అని చమత్కరిస్తున్నారు సినీ అభిమానులు.
మరి ఎస్ జే సూర్య రెండువైపులా విలన్ గా మారుతాడా లేక, పవన్ ఫ్యాన్స్ తనమీద పెట్టుకున్న అపనమ్మకాన్ని తప్పుగా తెలుస్తాడా చూడాలి.