బాహుబలి తర్వాత మీరు చేయబోతున్న సినిమా ఏంటీ అంటూ రాజమౌళిని గతంలో ప్రశ్నించిన సమయంలో పలు సందర్బాల్లో మహేష్బాబుతో తన తదుపరి చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.అయితే మహేష్బాబుతో కాకుండా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంను రామ్చరణ్, ఎన్టీఆర్లతో తెరకెక్కిస్తున్నాడు.
మహేష్బాబుతో సినిమా అంటూ ఊరించిన జక్కన్న వారితో సినిమా చేయడంను చాలా మంది తప్పుబట్టారు.అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత తప్పకుండా మహేష్బాబుతోనే ఉంటుందని జక్కన్న ప్రకటించాడు.
తాజాగా టీవీ9తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడిన రాజమౌళి మాట్లాడుతూ దానయ్య గారి తర్వాత కేఎల్ నారాయణ గారితో ఒక సినిమా చేయాల్సి ఉంది.ఆర్ఆర్ఆర్ తర్వాత నారాయణ గారి నిర్మాణంలో మహేష్బాబుతో సినిమాను చేయబోతున్నట్లుగా గతంలో వందల సార్లు చెప్పాను.
ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా మహేష్బాబుతోనే సినిమా ఉంటుందేమో అనిపిస్తుంది.
ప్రస్తుతం మహేష్బాబు తన 27వ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు.అయితే వీరిద్దరి కాంబోలో సినిమాకు కనీసం రెండేళ్లు అయినా పట్టే అవకాశం ఉంది.వచ్చే ఏడాదిలో సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుంది అంటున్నారు.
ఆ తర్వాత కనీసం ఆరు నెలలు అయినా పూర్తి విశ్రాంతిని రాజమౌళి తీసుకుంటాడు.అంతా అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివర్లో మహేష్బాబుతో రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.2023 లేదా 24 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.