‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోగా రాజ్ తరుణ్ మరియు హీరోయిన్గా అవికా గౌర్లు పరిచయం అయిన విషయం తెల్సిందే.మొదటి సినిమాతోనే వీరిద్దరికి మంచి బ్రేక్ వచ్చింది.
ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో వీరిద్దరు కూడా ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు.ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం వచ్చింది.
అది కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇలా ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి.
రాజ్ తరుణ్ మూడవ ప్రయత్నంగా తాజాగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రంలో నటించాడు.ఆ సినిమా కూడా బంపర్ హిట్ అయ్యింది.
‘కుమారి 21ఎఫ్’లో హెబ్బా పట్టేల్ హీరోయిన్గా నటించింది.ఇక ఇప్పుడు అవికా గౌర్ ‘తను నేను’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాజ్ తరుణ్కు లక్క్ కలిసి వచ్చినట్లుగానే ఈ చిన్నారి పెళ్లి కూతురు హెబ్బా పటేల్కు కూడా కలిసి వస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది.దర్శకుడు స్వర్గీయ శోభన్ కొడుకు అయిన సంతోష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
ఈ సినిమాకు మహేష్బాబు శుభాకాంక్షలు తెలపడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.ఇండస్ట్రీలో ప్రముఖులు ఈ సినిమా సక్సెస్ అయ్యి, శోభన్ కొడుకు సంతోష్కు సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నారు.
మరి ఈ సినిమాతో సంతోష్ మరియు అవికాలు సక్సెస్ను తమ ఖాతాలో వేసుకుంటారా అనేది చూడాలి.