సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు మరణించిన విషయం విదితమే.రమేష్ బాబు మరణించడంతో టాలీవుడ్ ఇండస్ర్టీ దిగ్బ్రాంతికి గురి అయ్యింది.
ఆయన అకాల మరణం సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని అభిమానులను కూడా విషాదానికి గురి చేసింది.శనివారం రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆయన దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధ పడుతున్నారని సమాచారం.నిన్న రమేష్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ కు ఆయనను తరలించారు.
కానీ ఆస్పత్రికి చేరుకునే లోపే ఆయన మరణించినట్టు తెలుస్తుంది.కార్డియాక్ అరెస్ట్ నే ఆయన మరణానికి కారణం అంటున్నారు.ఇక ఈ రోజు మధ్యాహ్నం రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా బారిన పడడంతో ఆయన కడసారి అన్నను చూసుకోలేక పోవడంతో మహేష్ బాబు ఎమోషనల్ అవుతున్నాడు.
అన్న అకాల మరణంతో ఆయన తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.ఇక ఎమోషనల్ అవుతున్న మహేష్ ను వైఫ్ నమ్రత ఓదార్చుతున్నారట.వీడియో కాల్ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ.
ఆయనలో దైర్యం నింపుతున్నారట నమ్రత.అంతేకాదు అంత్యక్రియల్లో కూడా మహేష్ లేని లోటును తీర్చేందుకు కూడా ప్రయత్నించారు.రమేష్ బాబు భార్య, పిల్లలను ఓదార్చుతూ వారికీ తోడుగా నిలిచారట నమ్రత.
కొద్దిసేపటి క్రితమే రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో నిర్వహించిన రమేష్ బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు.