టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది.
ఈ సినిమాను మైత్రి మూవీస్, జిఎంబి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా మహేష్ తనతో పాటుగా తన ఫ్యామిలీని కూడా స్పెయిన్ కు తీసుకు వెళ్ళాడు.
గత వారం రోజులుగా మహేష్ బాబు ఫ్యామిలీ స్పెయిన్ లో ఉంది.
కీర్తి సురేష్, మహేష్ బాబు లా సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.తమన్ ఇచ్చిన అద్భుతమైన పాటలకు శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారు.
ఇక తమన్ పాటలకు నమ్రతా ఫిదా అయినట్టు తెలుస్తోంది.ఎందుకు నమ్రత తమన్ కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది.
మహేష్ బాబు షూటింగ్లో బిజీగా ఉంటే నమ్రత తన పిల్లలతో కలిసి అక్కడ ప్రదేశాలను ఎంజాయ్ చేస్తోంది.
నమ్రతకు సోమవారం అంటే అస్సలు నచ్చదట.మామూలుగా అందరికీ వీకెండ్ అంటే చాలా ఇష్టం.అలా వీకెండ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్లీ పనులు ప్రారంభించాలి.
ఆ తర్వాత మళ్లీ కొత్త వారం స్టార్ట్ చేయాలంటే చాలా మందికి నచ్చదు.అలాంటి వారిలో నమ్రత కూడా ఉన్నట్లు తాజా గా తెలిపింది.