మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయిన్ నే వేరు.సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.
ఇక ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్న వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.
ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
ఒక వైపు దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా గురించి చర్చిస్తూనే మరో వైపు ఇప్పటికే లాంచ్ చేసిన త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ జులై నుండి స్టార్ట్ కాబోతుందట.
ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట.జులై లో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి కావాలన్సిన అన్ని పనులను పూర్తి చేసారట.ఈ సినిమా జులై లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ నాటికీ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలి అన్నది ప్లాన్.2023 సంక్రాంతి లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారట.అందుకే ఈ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ ప్లాన్ గీస్తున్నాడట.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ తో పాటు న్యాచురల్ స్టార్ నాని స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నాడు అని వైరల్ అవుతుంది.
దీనిపై అధికారిక క్లారిటీ లేకపోయినా ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.