బాలనటుడిగా సినీప్రస్థానాన్ని ప్రారంభించిన మహేష్ బాబు వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.అటు మాస్ ఆడియెన్స్ లోనూ, ఇటు క్లాస్ ఆడియెన్స్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న మహేష్ బాబు సినిమాల విషయంలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశారు.
ఆ ప్రయోగాల్లో కొన్ని ప్రయోగాలు సక్సెస్ కాగా కొన్ని ప్రయోగాలు మాత్రం ఫెయిల్ అయ్యాయి.అయితే మహేష్ బాబు అభిమానులు ఆనందించే మరో పని చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం మహేష్ బాబు తొలిసారి పూర్తిస్థాయి సింగర్ గా గొంతు సవరించుకోనున్నారని తెలుస్తోంది.
మహేష్ బాబు మాటలు ఆయన నటించిన సినిమాలోని పాటల్లో వినిపించినా పూర్తిస్థాయి గాయకుడిగా మహేష్ బాబు ఇప్పటివరకు గుర్తింపు తెచ్చుకోలేదు.
సర్కార్ వారి పాట సినిమాతో మహేష్ బాబు తనలోని గాయకుడిని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
చాలా నెలల క్రితమే సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.ఇప్పటివరకు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పాటలు పాడి అభిమానులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు.
సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సర్కార్ వారి పాట సినిమా ఫస్ట్ లుక్ ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఎంతో నచ్చింది.
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ మహేష్ కు విలన్ గా కనిపించబోతున్నారు.