సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ అందుకుని అదే జోష్ లో మరొక సినిమా మొదలు పెట్టాడు.ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటిస్తుంది.పరశురామ్ ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి చూపించ బోతున్నారని సమాచారం.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అందుకే ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా అలా ప్రకటించాడో లేదో ఇలా రూమర్స్ మొదలయ్యాయి.ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ శిల్ప శెట్టి కూడా నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది.
త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఉంటారు.తాజాగా మహేష్ తో చేస్తున్న సినిమాలో కూడా శిల్ప శెట్టిని తీసుకు రాబోతున్నారని టాక్.అయితే ఈ సినిమాలో శిల్ప శెట్టి మహేష్ బాబుకు పిన్నిగా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31 న పూజ కార్య క్రమాలతో మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.